ఎన్నికల ప్రచారంలో మాగంటి గోపినాథ్‌కు చేదు అనుభవం

Update: 2018-11-10 11:12 GMT

ప్రచారంలో పాల్గొంటున్న టీఆర్‌ఎస్‌ నేతలకు ప్రజల నుంచి ఊహించని నిరసనలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యే నుంచి మంత్రులు వరకు ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొక తప్పడం లేదు. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు చేదు అనుభవం ఎదురయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కళ్యాణ్ నగర్ లో పర్యటిస్తున్న మాగంటిని స్దానిక మహిళ నిలదీసింది. తమ అపార్ట్ మెంట్ సమస్యల పై ఆ మహిళ మాగంటి నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం జరిగింది. సిగ్గు లేకుండా ఓట్లు అడగడానికి ఎలా వచ్చవంటూ మాగంటి పై స్థానిక మహళ దుమ్మెత్తిపోసింది.

Similar News