మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. కోటపల్లి మండలం రాజారాంలో భూరికార్డుల తప్పిదాలకు ఒకరు బలయ్యారు. లక్ష్మి అనే మహిళకు చెందిన భూమిని.. శ్యామల పేరుపై అధికారులు రికార్డులో నమోదు చేశారు. దీంతో తనకు భూమి దక్కదేమోనని ఆందోళన చెందిన లక్ష్మి పురుగులమందు తాగి, ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన శ్యామల, తనపై కేసు నమోదు అవుతుందనే భయంతో ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రసుత్తం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్యామల పరిస్థితి విషమంగా ఉంది.