కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట దేవస్ధానం ఛైర్మన్ సంజీవరెడ్డిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నాలుగు సంవత్సరాలుగా తనను లోబరుచుకుని వేధిస్తున్నాడంటూ జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన 20 గుంటల భూమి తీసుకుని డబ్బు చెల్లించకుండా తనను బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. అయితే తాను ఛైర్మన్పై ఫిర్యాదు చేస్తే భార్య, భర్తల మధ్య విభేదాలంటూ కౌన్సిలింగ్ ఇచ్చి పంపారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.