వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు భార్య బుద్ధి చెప్పిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. కలెక్టరేట్లో ఏఓగా పనిచేస్తూ సస్పెండ్కు గురైన హరిప్రసాద్ గత కొద్ది కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య నిలదీయడంతో వేధించడం ప్రారంభించాడు. నిన్న రాత్రి ఇంటికి రాకపోవడంతో విషయం గ్రహించిన భార్య తల్లిదండ్రులతో కలిసి భర్త ఉన్న చోటుకు వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. పారిపోయేందుకు ప్రయత్నించిన భర్తతో పాటు వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.