విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్పై దాడి జరిగింది. హైదరాబాద్ వచ్చేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్పై వెయిటర్ చందన శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చిన శ్రీనివాస్ దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే చికిత్స అనంతరం జగన్ ... హైదరాబాద్కు బయలుదేరారు.