సినీ హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో నిందితులైన అతని భార్య వనితా రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నటుడు విజయ్సాయి ఈనెల 11వతేదీన యూసుఫ్గూడలోని తన అపార్టుమెంట్లో ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డ విషయం తెలిసిందే. కాగా... ఈ సంఘటనపై విజయ్సాయి భార్య వనితారెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. అంతేగాక నా కుమారుడు ఆత్మహత్యకు వనితారెడ్డే కారణమంటూ విజయ్సాయి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసునమోదు కాగా... బుధవారం ఆమె పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.