నరబలి కేసులో కీలక మలుపు

Update: 2018-02-15 05:38 GMT

  హైదరాబాద్‌ ఉప్పల్‌ నరబలి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చనిపోయింది పాపేనని అధికారులు దృవీకరించారు. రాజశేఖర్‌ ఇంటో రక్త నమునా..ఇంటిపై దొరికిన రక్త నమునా ఒక్కటేనని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఇచ్చింది. డిఎన్‌ఎ రిపోర్టు ఆధారంగా రాజశేఖర్‌ నిందితుడిగా తేల్చిన పోలీసులు. రాజశేఖర్‌ ఇంట్లో నరబలి జరిగిందని పోలీసులు నిర్ధారించారు. సాయంత్రం 4.0 గంటలకు మీడియాకు వివరాలు తెలపనున్న పోలీసులు. భార్య అనారోగ్యం కారణంగానే నరబలి ఇచ్చినటు, రూ.40 వేలకు తండా నుంచి ఆడశిశువు కొనుగోలు చేసినట్లు నిందితుడు వెల్లడించారు. నరబలి కేసులో మొత్తం 10 మంది నిందితులను గుర్తించిన పోలీసులు. రాజశేఖర్‌ ,భార్య శ్రీలత సహా మరో ఆరుగురును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Similar News