ఎంపీ కవిత కీలక ప్రకటన

Update: 2018-10-05 10:03 GMT

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటేలా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఎంపీ కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ సారి బతుకమ్మ పండుగకు తెలంగాణ జాగృతి దూరంగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు. గతంతో బతుకమ్మ పండుగ నిర్వహణ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తెలంగాణ జాగృతి తీసుకోలేదని కవిత అన్నారు. భవిష్యత్‌లోనూ తీసుకోమని వెల్లడించారు. నాలుగేళ్ల కాలంలో విపక్షాలు చేసిన వ్యాఖ్యలు బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News