విద్యుత్ అక్రమాలపై చర్చకు టీకాంగ్ రెడీ..చర్చకు రానున్న రేవంత్, సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్

Update: 2018-01-12 06:35 GMT

విద్యుత్ అక్రమాలపై చర్చకు రెడీ అయ్యారు. టీఆర్ఎస్ నేతలతో చర్చకోసం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ గన్ పార్క్ దగ్గరకు రాబోతున్నారు. చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, మరోనేత దాసోజు శ్రవణ్ రావాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ నేతలు ఎవరు వచ్చినా...తాము చర్చకు సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటుంటే..ఈ చర్చకు అధికార పార్టీ నాయకులు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి వస్తే తాము చర్చలో పాల్గొనబోమని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇప్పటికే చెప్పారు. దీంతో టీఆర్ఎస్ చర్చకు రాకపోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది.
 

Similar News