పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. చింతమనేని అరాచాకాలను అరికట్టి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ నాయకుల దీక్ష చేపట్టారు. వైసీపీ దీక్షకు నిరసనగా మరో టెంట్ వేసి టీడీపీ నేతలు దీక్ష చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు టీడీపీ, వైసీపీ దీక్షా శిబిరాను తొలగించారు.ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.