పోరాటానికి సమయం ఆసన్నమైంది...ఇక తెగదెంపులే: ఎంపీ టీజీ

Update: 2018-02-02 06:53 GMT

టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లు గడిచిపోయాయి, ఇక సహించేది లేదన్న టీజీ కేంద్రంపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబును ఎవరూ తక్కువ అంచనా వేయొద్దన్న టీజీ వెంకటేష్‌ మరోసారి కేంద్రంలో చక్రం తిప్పే సత్తా బాబుకి ఉందన్నారు. సొంతంగా బలముందనే పొగరు బీజేపీకి ఉన్నా  కేంద్రంపై అంచెలంచెలుగా పోరాడతామన్నారు. మూడు విడతలుగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న టీజీ చివరి అస్త్రంగా ఇక తెగదెంపులేనన్నారు. పోరాట కార్యాచరణను ఆదివారం చంద్రబాబు ప్రకటిస్తారన్నారు.
 

Similar News