టీడీపీ ఎంపీలను చర్చలకు పిలిచిన వెంకయ్య, జైట్లీ..వెళ్లేందుకు సభ్యుల విముఖత

Update: 2018-02-06 09:26 GMT

విభజన హామీలపై చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీలు...టీడీపీ ఎంపీలను చర్చలకు ఆహ్వానించారు. చర్చలకు వెళ్లేందుకు టీడీపీ ఎంపీల విముఖత వ్యక్తం చేశారు. మరోవైపు లోక్‌సభలో టీడీపీ, వైసీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. విభజన హామీలు నెరవేర్చాలంటూ...వెల్‌లోకి వెళ్లి ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్న ఎంపీ మాగంటి బాబుపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Similar News