వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, వైసీపీ పరిస్థితి కుక్కులు చింపిన విస్తరే

Update: 2018-06-16 12:18 GMT

వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, వైసీపీ పరిస్థితి కుక్కులు చింపిన విస్తరి అవడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. సీఎం చంద్రబాబుపై బీజేపీ, వైసీపీ కుట్ర చేస్తున్నాయని, రాజకీయ, భౌతిక దాడులకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. నాడు గోద్రా అల్లర్లలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మోడీ వ్యవహరించారని, దీనిని వ్యతిరేకించినందుకే చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని చెప్పారు. ప్రధానిగా మోడీ ఉన్నంత వరకూ దేశ ప్రజలకు రక్షణ ఉండదని, దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోడీని గద్దె దించే దమ్ము చంద్రబాబుకే ఉందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. 
 

Similar News