కృష్ణాజిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా సిబ్బందిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. పోలవరం యాత్రకు వెళ్తోన్న టీడీపీ బస్సులను టోల్ప్లాజా సిబ్బంది ఆపడంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు.... బూతులు తిడుతూ వీరంగమాడారు. అధికార పార్టీ బస్సులనే ఆపుతారా అంటూ టోల్ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు.