హైకోర్టుకు స్వామి పరిపూర్ణానంద

Update: 2018-07-11 11:07 GMT

స్వామి పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. తనను హైదరాబాద్‌ నుంచి బహి‌ష్కరిస్తూ తెలంగాణ పోలీస్‌ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేశారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసిన పరిపూర్ణానంద తనపై బహిష్కరణ వేటు తొలగించేలా తెలంగాణ పోలీస్‌ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌ నుంచి బహిష్కరించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన స్వామి పరిపూర్ణానంద ఇది భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనన్నారు.

Similar News