విశాఖ గాజువాకలో పెను ప్రమాదం తప్పింది. రవీంద్ర భారతి స్కూల్కు చెందిన రెండు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. పార్కింగ్ ప్లేస్లో ఉన్న బస్సుల్లోంచి మంటలు రావడం గమనించిన సిబ్బంది ..హుటాహుటిన మిగిలిన బస్సులను అక్కడకు నుంచి తీసివేశారు. ఈ ఘటనలో రెండు బస్సులు కాలి బూడిద కాగా సమీపంలోని మరో లారీ స్వల్పంగా దెబ్బతింది. ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్న యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.