సికింద్రాబాద్లో అర్ధరాత్రి లారీ బీభత్సం సృష్టించింది. ప్యాట్నీ సెంటర్లో వేగంగా వస్తున్న లారీ కార్లపైకి దూసుకెళ్లింది. దీంతో ఐదు కార్లు ధ్వంసం కాగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.