ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలో వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. పలువురు తెలంగాణ ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. త్యాగాలకు ప్రతిరూపం కాంగ్రెస్ పార్టీ అని సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. కాంగ్రెస్ అంటే ఇష్టం కావడంవల్లే ఆ పార్టీలో చేరానని చెప్పారు. పార్టీ ఏదీ చెబితే అది చేస్తానన్న బండ్ల గణేష..ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తానని అన్నారు. పవన్ కల్యాణ్ తనకు దేవుడితో సమానమనీ అయితే తాను కాంగ్రెస్ అభిమానినన్నారు..బండ్ల గణేష్.