రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన తరుపున పోటీ చేసే మొదట అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియజకవర్గానికి చెందిన రాజకీయ నేత పితాని బాలకృష్ణ జనసేనలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి గా పితాని బాలకృష్ణ పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు.