సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో టీఆర్ఎస్ ప్రచారాన్ని స్థానికులు అడ్డుకున్నారు. గజ్వేల్ మండలం బురుగుపల్లిలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా తమ గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి స్థానికులు నిలదీశారు. టీఆర్ఎస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అది కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్రెడ్డి స్వగ్రామం కావడంతో స్థానికులంతా టీఆర్ఎస్ గోబ్యాక్, ప్రతాప్రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆగ్రహించిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గ్రామస్థులతో ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగడంతో ఉద్రిక్తత తలెత్తింది.