ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విధించిన డెడ్లైన్కు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ప్రభుత్వం తీరును నిరసిస్తూ పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని పవన్ వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దీక్షకు అనుమతి కోసం శ్రీకాకుళం పోలీసులకు దరఖాస్తు చేయనున్నారు.