టీడీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్.. పిచ్చిపిచ్చి వేషాలొద్దు: పవన్

Update: 2018-07-05 10:51 GMT

టీడీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని టీడీపీ నేతలను హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యేలంటే ఏమైనా పైనుంచి దిగొచ్చారా? వాళ్లకు మేమేమైనా బానిసలమా? అని ప్రశ్నించారు. ప్రజాసేవ కోసం వచ్చినవారు, రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అల్లుడు ఎవరైనా సరే పరిధికి లోబడే ఉండాలని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తామంటే చేతులు కట్టుకుని కూర్చోబోమని హెచ్చరించారు. అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని పోతే ప్రాణాలే పోతాయని ధైర్యంగా అడుగువేశానని పవన్ చెప్పారు. రాజకీయ నాయకులు తలచుకుంటే ఒక్క సంతకంతో తలరాతలు మార్చేయవచ్చని తెలిపారు.  మౌనంగా చూస్తూ కూర్చుంటే విశాఖలోని డాల్ఫిన్ కొండలను కూడా టీడీపీ నేతలు ఆక్రమించుకుంటారని అన్నారు. తప్పు చేస్తున్నవారిని తానెందుకు ప్రశ్నించకూడదని నిలదీశారు. 

Similar News