‘చెల్లెలు కవిత గారికి థాంక్యూ’: పవన్‌కల్యాణ్‌

Update: 2018-02-10 05:12 GMT

టీఆర్ఎస్ ఎంపీ కవితకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. 'రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంటులో మాట్లాడిన చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. విభజన హామీలు అమలు చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన గళమెత్తిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా దీని గురించి లోక్‌సభలో మాట్లాడారు. ఆంధ్రాకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు. ఇదిలా ఉండగా హామీల విషయంపై కేంద్రం మళ్లీ పాతమాటే చెబుతుండటంతో ఆంధ్రా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Similar News