టీడీపీ, వైసీపీ, బీజేపీలపై పవన్ అటాక్

Update: 2018-04-04 11:13 GMT

ఏపీకి అన్యాయం జరిగినా.. టీడీపీ, వైసీపీలు సిగ్గులేకుండా విమర్శలు చేసుకుంటున్నాయని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్  విమర్శించారు. వామపక్షాలతో భేటీ అయిన పవన్.. బీజేపీపై విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ నమ్మకద్రోహం చేసిందని.. అవిశ్వాసం నోటీసులిచ్చినా.. చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా.. ఈ నెల 6 న జాతీయ రహదారులపై పాదయాత్ర చేసేందుకు నిర్ణయించినట్లు.. పవన్  ప్రకటించారు. 

Similar News