టీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని, అదో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా తయారైపోయిందని ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత రాములు నాయక్ మీడియాతో మాట్లాడారు. తన సస్పెన్షన్పై ఆయన కన్నీటి పర్యతమయ్యారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే తనను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. నాటి తెలంగాణ ద్రోహులు ప్రస్తుత కేసీఆర్ క్యాబినేట్ లో ఉన్నారని విమర్శించారు. వచ్చేఎన్నికల్లో టీఆర్ఎస్కు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.