టీడీపీ డ్రామాలు నడుపుతోంది

Update: 2018-10-26 07:05 GMT

టీడీపీ ఓ డ్రామా కంపెనీ అని.. వారి చిల్లర రాజకీయాలు తెలంగాణలో నడవవని.. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్‌ను పరామర్శించిన ఆయన.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్‌పై దాడి జరిగితే.. తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. ఘటనను కేంద్రం, తెలంగాణపైకి తోసేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Similar News