అయనకు సీఎం కుర్చీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు : మంత్రి సునీత

Update: 2017-12-29 12:55 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం రాప్తాడులో రుణమాఫీ పరిష్కార వేదికను ప్రారంభించిన మంత్రి.. రైతు రుణపత్రాలు పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ సొమ్ముఅందజేస్తామన్నారు. జగన్‌ అవాస్తవాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని, అధికార దాహంతో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్ధితిలో లేరని సునీత అన్నారు. జగన్మోహన్ రెడ్డికి సీఎం కుర్చీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు.


 

Similar News