కేసీఆర్‌పై మంత్రి నారాలోకేష్‌ సెటైర్లు

Update: 2018-09-07 06:28 GMT

కేసీఆర్‌పై మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. అమరావతిలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన తెలుగు వాళ్లంతా కలుసుండాలని  ఓ వైపు చెబుతూనే మరో వైపు జాగో  బాగో అంటున్నారన్నారు. టీఆర్ఎస్‌లో టీడీపీ వాళ్లు ఎంత మంది ఉన్నారో అందరికి తెలుసంటూ వ్యాఖ్యానించిన లోకేష్‌ ఆంధ్రుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్‌ తన పక్కలో కూర్చోబెట్టుకున్నారన్నారు. ఆంధ్రా వాళ్ల ఓట్లతోనే టీఆర్ఎస్‌‌కు జీహెచ్‌ఎంసీ పీఠం దక్కిందన్నారు.  తెలంగాణ అసెంబ్లీ రద్దు ఆమోదం పొందిన సమయంలో నారాలోకేష్ కామెంట్స్ ఆసక్తి కరంగా మారాయి.  

Similar News