సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సఫల రాష్ట్రంగా స్థిరపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణం కాలేజ్ గ్రౌండ్లో మంత్రి కేటీఆర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతిఘాతక శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో ఎదురయ్యాయని... ఈనాడు పరిపాలనలో కూడా ఎదురవుతున్నాయని అన్నారు. సంకల్పం గట్టిదయితే ఎన్ని అవరోధాలైన అవలీలగా అధిగమించవచ్చిన ప్రభుత్వం రుజువుచేసిందని కేటీఆర్ తెలిపారు.