రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలసి పోటీ చేస్తాయట అంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎంత మంది కలిసినా టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుందని, రానున్న ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే కేసీఆర్ చేసిన పనులకు సార్థకత ఉంటుందని కేటీఆర్ పిలుపునిచ్చారు.