మహాకూటమిపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి జుట్టుంతా చంద్రబాబు చేతిలో ఉందని అధికారం కట్టబెడితే గుండు కొడతాడంటూ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇబ్రహీం పట్నం ప్రాంతాన్ని ఫార్మా హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.