సీపీఐ నేతలతో కోదండరాం భేటీ

Update: 2018-11-07 09:45 GMT

టీజేఎస్ అధినేత కోదండరాం సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. కూటమిలో రెండుపార్టీలకు సీట్ల కేటాయింపుపై చర్చించారు. బెల్లంపల్లి, వైరా, దేవరకొండ స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉందని అయితే హుస్నాబాద్ , కొత్తగూడెం స్థానాల కోసం సీపీఐ పట్టుబడుతుంది. కొత్తగూడెం స్థానం కోసం జాతీయ నాయకులపై కూనంనేని సాంబశివరావు ఒత్తిడి తెస్తున్నారు. సీపీఐకి మూడు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎన్నికల్లో గెలిచాక రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ ప్రతిపాదనలపై సీపీఐ , టీజేఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 

Similar News