టీ.జేఏసీ చైర్మన్ కోదండరామ్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కోదండరామ్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. నల్లగొండ పట్టణంలో ఒక కార్యక్రమానికి హాజరై హైదరాబాద్ తిరుగొస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని డివైడర్ మీదకు వెళ్లడంతో కారు ముందుభాగం దెబ్బతింది. బైకుపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిట్యాల మండలం వెలిమనేడు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.