మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిలతో పాటు రాహుల్ నివాసానికి చేరుకున్న ఆయన రాహుల్ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై రాహుల్తో చర్చించారు.