అసెంబ్లీ రద్దుపై కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్కు కేసీఆర్ అందించారు. కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ప్రక్రియ పూర్తయింది. గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. రాజ్భవన్ నుంచి నేరుగా కేసీఆర్ గన్పార్కుకు బయల్దేరారు. అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కు చేరుకొని మీడియాతో మాట్లాడనున్నారు. అసెంబ్లీ రద్దుకు గల కారణాలను వివరించనున్నారు.