‘‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఈ నెల 21నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు నా మద్దతు తెలుపుతున్నాను’’ అని మహేష్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వరకూ పవన్పై కారాలు మిరియాలూ నూరిన మహేష్ ఇప్పుడిలా ట్వీట్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే మరికొద్ది సేపట్లో పవన్ ప్రెస్మీట్ నిర్వహించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ ప్రెస్మీట్లో పవన్ తన కార్యాచరణను వెల్లడిస్తారేమో వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఈ నెల 21 నుంచీ న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ లో ఆమరణ నిరాహారదీక్ష చేయనున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కు నా మద్దత్తు తెలుపుతున్నాను.
— Kathi Mahesh (@kathimahesh) February 7, 2018