అధిష్టానం ఆదేశాలతో ఏపీ కేబినెట్లో తన మంత్రి పదవికి కామినేని శ్రీనివాస్ గురువారం రాజీనామాను చేశారు. ఈ నేపథ్యంలో అతడి రాజీనామాపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘శ్రీ కామినేని గారి రాజీనామాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పసికందులు మరణించిన వైభవ శకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ముగిసిందని భావిస్తున్నాను. చంద్రబాబు గారికి అభినందనలు’’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.