కేంద్ర బడ్జెట్పై జనసేన అధినేత పవన్ స్పందించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడుతానని చెప్పారు. మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలకు పార్టీలు జవాబుదారీగా ఉండాలని పవన్ అన్నారు. మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం చేయడానికి ఈ నెల 21న శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తానని పవన్ తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మత్స్యకారులతో సమావేశమైన పవన్ జనసేన అధికారంలోకి వస్తే మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు.