ఆంధ్రా జన్మనిస్తే...తెలంగాణ పునర్జన్మనిచ్చింది: పవన్‌కల్యాణ్

Update: 2018-01-23 07:01 GMT

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు కరీంనగర్‌‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మూడు జిల్లాల నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ... ఆంధ్రా నాకు జన్మనిస్తే... తెలంగాణ పునర్జన్మనిచ్చిందన్నారు. కొండగట్టు ఆంజనేయుడు నన్ను కాపాడారని పవన్ గుర్తుచేశారు. తెలంగాణ నేలతల్లికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. జై తెలంగాణ అంటే ఒళ్లు పులకరిస్తుందని పవన్ అన్నారు. వందేమాతరం లాంటి నినాదమే జై తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News