మొన్న నెల్లూరు, నిన్న విజయవాడ తాజాగా విశాఖలో ఐటీ దాడుల కలకలం రేగింది. ఐటీ దాడులు జరుగుతాయంటూ నిన్నటి నుంచి వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఈ తెల్లవారుజాము నుంచే విశాఖలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు. దువ్వాడ ప్రత్యేక ఆర్ధిక మండలి పరిధిలోని పలు కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. TGI కంపెనీలో సోదాలు చేపట్టిన అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 50 బృందాలు ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఐటీ రైడ్స్ సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ఎస్ఈజెడ్ పరిధిలో భారీగా పోలీసులను మోహరించారు .