మరో బాంబు పేల్చిన శివాజీ

Update: 2018-09-14 12:05 GMT

హీరో శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకు త్వరలో మరో రెండు నోటీసులు రానున్నాయి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక రాజ్యాంగబద్ధ సంస్ధ నుంచి నాలుగైదు రోజుల్లో నోటీసులు అందబోతున్నాయని సినీ హీరో శివాజీ 6 రోజుల క్రితం ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, మరో బాంబు పేల్చాడు. చంద్రబాబుకు మరో రెండుమూడు నోటీసులు రాబోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు వారి ట్రాప్‌లో పడొద్దని శివాజీ హితవు పలికారు. త్వరలో రెండో నోటీసులు రాబోతున్నాయని కూడా చెప్పుకొచ్చారు.

Similar News