టీఆర్ఎస్ కార్యకర్త, నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతిచెందాడు. ఓదెలుకు టిక్కెట్ ఇవ్వాలంటూ.. ఈ నెల 12 న ఆయన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తాజా మాజీ ఎమ్మెల్యే ఓదెలును కాదని.. బాల్క సుమన్కు టిక్కెట్ ఇవ్వడంపై ఆయన వర్గం ఆందోళన చేపట్టింది. ఈ నెల 12 న బాల్క సుమన్ ర్యాలీలో గట్టయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ ఆయన ఆరోగ్యం విషమించడంతో.. ప్రాణాలు కోల్పోయాడు.