ప్రేమించి పెళ్లి చేసుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిపై మొదటి భార్య దాడి చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని చైతన్యపురిలో చోటుచేసుకుంది. హనుమాన్ నగర్లోని ఒక అపార్ట్మెంట్లో రెండో భార్య ప్రత్యుషతో నివాసం ఉంటున్న ఇంటిపై మొదటి భార్య రమణి, ఆమె బంధువులు దాడి చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకుని భర్తకు దేహశుద్ధి చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్ శేషుకుమార్ 2009లో రాజమండ్రికి చెందిన రమణితో వివాహం జరిగింది. 2013 నుంచి మొదటి భార్యకు దూరంగా ఉంటూ రెండో భార్య ప్రత్యుషతో కాపురం చేస్తున్నాడు. ఈ రోజు గుర్తించిన రమణి బంధువుల సహాకారంతో భర్తను పట్టుకుని దేహశుద్ధి చేసింది. కేవలం డబ్బు కొరకే తనను పెండ్లి చేస్తుకుని మోసం చేశాడని తనకు, తన కూతురికి న్యాయం చేయచేయాలని రమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.