వరంగల్‌ ఎంజీఎం పిల్లల వార్డులో అగ్నిప్రమాదం..

Update: 2018-09-27 05:22 GMT

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. చిన్న పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగిన వార్డు నుంచి పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో పేషెంట్లు భయాందోళనకు గురయ్యారు. చిన్నపిల్లల వార్డులోని ఏసీల్లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చిన్నపిల్లల వార్డ్‌ నుంచి పేషంట్లను వేరే వార్డులకు తరలించారు.

Similar News