కుత్బుల్లాపూర్ సుచిత్ర సర్కిల్లోని ఆరెంజ్ ట్రావెల్స్లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్లో చెలరేగిన మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్లోని బస్సుల గ్యారేజిలో షాట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాద సమయంలో బస్సులు ఏవీ లేకపోవడంతో ఆస్తి నష్టం జరుగలేదు.