హైదరాబాద్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం సాయంత్రం స్టేషన్లో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి. దీంతో మంటలు చెలరేగటంతో... వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు వెల్డింగ్ పనులు చేస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించి వీడియో ....