ప్రగతి నివేదన సభ: నకిలీ కరెన్సీ..

Update: 2018-09-02 13:31 GMT

ప్రగతి నివేదన సభ కోసం చేపట్టిన ర్యాలీలో నకిలీ కరెన్సీ కలకలం రేగింది. రామంతాపూర్‌ కు చెందిన కార్పోరేటర్‌ గంధం జ్యోత్స్ననాగేశ్వరరావు ఆధ్యర్యంలో ఓ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కొందరు వ్యక్తులు నకిలీ కరెన్సీని వెదజల్లారు. దాంతో అక్కడున్న కార్యకర్తలు, జనాలు నోట్లనుకుని ఏరుకునేందుకు పోటీపడ్డారు. తీరా అవి ఒరిజినల్ కాకుండా నకిలీ నోట్లని తెలియడంతో నిరాశకు లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

Similar News