ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని సీఎల్పీ నేత జానారెడ్డి చెప్పారు. డీలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా అభ్యంతరం లేదన్న జానారెడ్డి డీలిమిటేషన్పై జరగదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రయత్నాలు సహజమన్న ఆయన ఆలాంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్నారు. మహాభారతంలో ఎక్కువ అస్త్రాలు, జనం కౌరవుల వద్దే ఉన్నప్పటికీ పాండవులే విజయం సాధించారని చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులను బలహీనపరిచే ప్రయత్నం చేసినా ప్రజాప్రాయం తమ వైపే ఉందన్నారు.