అమరులకు నివాళులర్పించిన కేసీఆర్‌

Update: 2018-06-02 05:11 GMT

తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకలను పురస్కరించుకొని.. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాళి అర్పించారు. అమరవీరుల స్థూపం పుష్పగుచ్ఛం ఉంచారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం అటు నుంచి పరేడ్‌గ్రౌండ్స్‌కు సీఎం కేసీఆర్ బయల్దేరారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనాన్ని సీఎం స్వీకరించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు.

Similar News