బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా తెలుగుదేశం, వైసీపీలు కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెడుతుంటే మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఏర్పాటు చేయబోయే ఫ్రంట్కు మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ రూపకల్పనకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఇవాళ కోల్కతా వెళ్లనున్నారు. తృణమూల్ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సమావేశమై మద్దతు కోరనున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాలు, ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు.